స్టాక్ మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే సెన్సెక్స్ అంటే ఏమిటి?
స్టాక్ మార్కెట్ లో మీరూ ప్రతి రోజూ వినే సెన్సెక్స్ అంటే ఏమిటి?
సెన్సెక్స్ లేదా సెన్సిటివ్ ఇండెక్స్ ( SENSEX-or SENSitve index ) ను జనవరి 1 1986 రొజూ ముంబాయి స్టాక్ ఎక్సేంజీ ద్వారా పరిచయం చేసారు.ఇది ఇండియా లో గల ప్రముఖ ఇండేక్స్లలో ఒకటి .ఈ సెన్సెక్స్ మొత్తం మార్కెట్ ను ప్రతిబంబించేలా రూపొందించబడినది.దీనిలో బాగా పేరొందిన , స్థిరపడిన , ఆర్ధికంగా బాగా బలమైన పునాదులు కలిగినటువంటి ముప్పై పెద్ద కంపెనీలతో ఏర్పాటు చేయడం జరిగినది.సెన్సెక్స్ లెక్కించడం కోసం ఆ కంపీనీ మార్కెట్ కాపిటలైజేషన్ లెక్కలోకి తీసుకోవడం జరిగినది. అధిక కాపిటలైజేషన్ కలిగిన కంపెనీకి అధిక వెయిటేజీ ఇవ్వడం జరిగినది.అదే విధంగా 1978-79వ సంవత్సరం ను బెస్ సంవత్సరంగా , 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా పరిగణలోకో తీసుకోవడం జరిగినది.అంటే సెన్సెక్స్ నిర్మాణ సమయంలో మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ విలువ 100 తీసుకోవడం వలన మరుసటి రోజూ మార్కెట్ కాపిటలైజేషన్ 10% పెరిగితే ఇండెక్స్ కూడా 10% పెరిగి 100 నుండి 110 అవుతుంది. 100 ను బెస్ ఇండెక్స్ వాల్యుగా తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం లెక్కించడానికి సులభంగా ఉంటుంది అనే ఆలోచనే. సెన్సెక్స్ లో ఎన్నుకొనే కంపెనీలు క్వాలిటీ పరంగా మరియు క్వాంటిటీ పరంగా మంచి లక్షణాలు కలిగిఉంటాయి.
ఇప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్ యే విధంగా నిర్మిస్తారో ఒక్కసారి చూద్దాం.మార్కెట్ లో ఒక స్టాక్ మాత్రమే ఉంటే దానిలో పెరుగుదల కాని, పతనం కాని సులభంగా అర్ధం చేసుకోవచ్చు. బెస్ ఇండెక్స్ విలువ 100 కాబట్టి ఒక స్టాక్ యొక్క ధర 200 నుండి 240 వరకు పెరిగితే ఆ స్టాక్ లో పెరుగుదల 20% నమోదు ఐతే ఇండెక్స్ లో కూడా పెరుగుదల 20% ఉండి ఇండెక్స్ 100 నుండి 120 కి చేరుకుంటుంది. మరుసటి రోజు ఆ స్టాక్ యొక్క ధర 10% పతనం జరిగి 216 కు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్ కూడా 10% తగ్గడంతో 110 కి చేరుకుంటుంది.ఈ విధంగా సెన్సెక్స్ లో ఒకే స్టాక్ ఉండటం వలన ఇండెక్స్ విలువ మనం లెక్కించడం సులభంగా జరిగినది. మరి ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు స్టాక్ లు ఉంటే యే విధంగా లెక్కించాలో చూద్దాం.
ఇప్పుడు ఇండెక్స్ లో A మరియు B అనే రెండు కంపెనీల స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. A స్టాక్ ధర 200 వద్ద ఉంది , B స్టాక్ ధర 150 వద్ద ఉంది.సెన్సెక్స్ ఇండెక్స్ ఏర్పాటు చేయడంలో స్టాక్స్ యొక్క మార్కెట్ కాపిటలైజేషన్ పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఆ కంపెనీకి ఇండెక్స్ లో వెయిటేజీ ఇస్తారు అని మనం ఇది వరకే తెలుసుకున్నాం. మరి ఇప్పు ఈ రెండు స్టాక్ ల యొక్క వెయిటేజీ ఏవిధంగా తెలుసుకోవాలో ఒక్కసారి చూద్దాం. ఒక కంపీనీ లో గల మొత్తం షేర్లను ఆ కంపెనీ షేరు లేదా స్టాక్ ధరతో గుణించగా వచ్చేదే మార్కెట్ కాపిటలైజేషన్ . కంపెనీ A వద్ద 100,000 షేర్లు మరియు కంపెనీ Bవద్ద 200,000 షేర్లు ఉంటే కంపెనీ A కాపిటలైజేషన్ 200 x 100000 =20000000 మరియు కంపెనీ B కాపిటలైజేషన్ 150 x 200000 = 30000000 అవుతుంది. మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ (200 x 100000 + 150 x 200000) Rs 500 lakhs అవుతుంది. ఈ మొత్తం సెన్సెక్స్ ఇండెక్స్ బెస్ విలువ 100 కి సమానం అవుతుంది.ఇప్పుడు కంపెనీ A స్టాక్ ధర 260 (30% increase in price) కి చేరుకుంది.కంపెనీ B స్టాక్ ధర 135. (10%drop in price)కి చేరుకుంది.ఇప్పుడు మార్కెట్ కాపిటలైజేషన్ 260 x 100000 +135 x 200000= Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే స్టాక్స్ ధరలలో మార్పు వల్ల మార్కెట్ కాపిటలైజేషన్ ) Rs 500 lakhs నుండి Rs 530 lakhsలకు చేరుకుంది. అంటే 6% పెరుగుదల నమోదు కావడం జరిగినది కావున సెన్సెక్స్ ఇండెక్స్ లో కూడా పెరుగుదల 6% నమోదు కావడం జరుగుతుంది కాబట్టి సెన్సెక్స్ ఇండెక్స్ 100 to 106 మార్పు చెందడం జరుగుతుంది.ఈ విధమైన లాజిక్ ను సెన్సెక్స్ లో ఎంచుకున్న స్టాక్స్ అన్నిటికి విస్తరించి లెక్కించడం జరుగుతుంది. అందుకే స్టాక్స్ యొక్క ధరల మార్పు కి అనుగుణంగా సెన్సెక్స్ కూడా మార్పు చెందడం జరుగుతుంది. ఐతే సెన్సెక్స్ ఇండెక్స్ ముప్పై ఆర్ధికంగా బలంగా ఉన్న పెద్ద కంపెనీలను చేర్చడం ద్వారా లెక్కిస్తాయు అని తెలుసుకున్నాం. కాని ఒక్క విషయం ఈ విధంగా లెక్కించడానికి కంపెనీ యొక్క అన్ని షేర్లను పరిగణలోకి తీసుకోరు. కేవలం ఫ్రీ ప్లోటింగ్ ఉన్న షేర్ల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.ప్రీ ప్లోటింగ్ అంటే ఏమిటో మనం ఒక్క సారి తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లో ప్రజలూ ట్రేడ్ చేయడానికి అందుబాటులో ఉన్న షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.అంటే కంపెనీ ప్రమోటర్లు, FDIs , ప్రభుత్వం వద్ద ఉన్న షేర్లు మినహాయించి మిగిలిన షేర్లను ప్రీ ప్లోటింగ్ షేర్లు అంటారు.ఒక కంపెనీ యొక్క ప్రీ ప్లోటింగ్ విలువను లెక్కించాలి అంటే ఒక కంపెనీ మొత్తం కాపిటలైజేషన్లో ఎంత శాతం పబ్లిక్ వద్ద ఉందో ఆ మొత్తం ను పరిగణలోకి తీసుకుంటారు.. పబ్లిక్ వద్ద ఎంత శాతం షేర్లు అందుబాటులో ఉంటే ఆ కంపెనీ యొక్క ప్రీ ప్లోటింగ్ విలువ ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణకు ఒక కంపెనీ యొక్క మార్కెట్ విలువ Rs 100,000 కోట్లు అనుకుంటే ఒక్క షేర్ విలువ Rs 1,000 ఐతే కంపెనీ వద్ద ఉన్న మొత్తం షేర్ల సంఖ్యా 100 అవుతాయి. కాని కేవలం 20% షేర్లు మాత్రమే పబ్లిక్ కి అందుబాటులో ఉంటే అప్పుడు కంపెనీ యొక్క ఫ్రీ ప్లోటింగ్ మార్కెట్ విలువ మొత్తం కంపెనీ యొక్క మార్కెట్ విలువ లో 20% మాత్రమే అవుతుంది. అంటే Rs 100,000x20% =20,000అవుతుంది.మీరు ఈ ఫ్రీ ప్లోటింగ్ విలువ ఎప్పటికప్పుడు క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇప్పుడు సెన్సెక్స్ లో గల ముప్పై కంపెనీల ఫ్రీ ప్లోటింగ్ విలువ ప్రకారం సెన్సెక్స్ ఇండెక్స్ పెరగడం లేదా తగగ్డం జరుగుతుంది.
ఉదాహరణకు Rs 10,00,000కోట్ల ఫ్రీ ప్లోట్ మార్కెట్ కాపిటలైజేషన్ ఉన్నప్పుడు సెన్సెక్స్ ఇండెక్స్ 12500 ఉంటే , ఫ్రీ ప్లోట్ మార్కెట్ కాపిటలైజేషన్ పెరిగి Rs 11,50,000 కోట్లకు చేరుకుంటే సెన్సెక్స్ ఇండెక్స్ ఎంత ఉండగలదో లేక్కగట్టండి.తెలియడం లేదా ఐతే సమాధానం ఏంతో తెలుసా 14,375. ఎలాగో తెలియడం లేదా చిన్నప్పుడు లెక్కల్లో నేర్చుకున్న ratios and proportionsగుర్తుతెచ్చుకోండి.ఐనా సాధ్యం కాకపోతే మాకు మెయిల్ చేయండి.
మీ కుటుంబ రక్షణ కోసం చదవండి ?
http://www.smtv24x7.com/english-news-24434-vice-president-honored-17-best-teacher-awards.html
మీ కుటుంబ రక్షణ కోసం చదవండి ?
మీరు 2007లో 25 లక్షలకు ఇన్సురెన్స్ పాలసీ తీసుకోవడం జరిగినది.మీరు మీ పాలసీ ప్రీమియం 07, 08,09,2010లో చెక్ ద్వారా చెల్లించడం జరిగినది. 2011లో మాత్రం క్యాష్ ద్వారా చెల్లింపు చేయడం జరిగినది.అంటే మీ పాలసీ అమలులో ఉన్నది. మీరు 20122 లో ఆకస్మికంగా మరణించడం జరిగినది.మీ కుటుంబం మీ పాలసీ చూసి మీ ఇన్సురెన్స్ ఏజెంట్ కి కాల్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదు. మీ కుటుంబానికి ఏమి చేయాలో పాలు పోవడం లేదు.చివరకు మీ వాళ్ళు ఇన్సురెన్స్ కంపెనీ ని సంప్రందించి మీ మరణ వార్త తెలియచేయడంతోపాటు పాలసీ వివరాలు వారికి అందించడం జరిగినది.అప్పుడు కంపెనీ చిన్నగా సారీ చెప్తూ పాలసీ ప్రీమియం చెల్లించలేదు కావున ఇన్సురెన్స్ పాలసీ రద్దు చేయడం జరిగినది అని తెలియచేస్తే మీ కుటుంబం ఏమి చేయగలదు. సాదారణంగా ఇంటికి వచ్చి రసీదుల కోరకు వెతకడం చేస్తుంది. కాని అది వారికి దొరకదు. ఎందుకంటె చాలా మందికి రసీదులు జాగ్రత్తగా భద్రపరిచే అలవాటు లేదు. ఒకవేళ భద్రపరిచిన అవి ఎక్కడ ఉంటాయో చాలా మంది కుటుంబ సభ్యులకు తెలియను కూడా తెలియదు.మీరు మాత్రం అలంటి పొరపాటు ఎత్తి పరిస్తితులలో చేయవద్దు. మీ పాలసీల వివరాలు , వాటి రసీదులు మొదలగునవి ఎక్కడ ఉన్నాయో , క్లైమ్ లాంటివి ఏ విధంగా చేసుకోవాలో వివరంగా మీ కుటుంబ సభ్యులకు వివరంగా తెలియచేయండి. కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఐనప్పటికీ కూడా ఈ వివరాలు మీ కుటుంబ సభ్యులకు తెలియచేయడం చాలా మంచిది.
ఈవారం స్టాక్ మార్కెట్ 29-10-2012to02-11-2012
ఈవారం స్టాక్ మార్కెట్ 29-10-2012to02-11-2012
గత వారం కూడా దాదాపుగా సైడ్ వేస్ లోనే చలించడం జరిగినది. చివరకి ఎక్స్ ఫైరీ రోజు కూడా మార్కెట్ ప్రభావం చూపలేకపోయినది. అందువలన నిఫ్టీ 5635-5725 ల మధ్య కదలాడుతున్నంతవరకు ట్రేడింగ్ కి ఉఎలాంటి అవకాశం ఉండటం లేదు. సేఫ్ ట్రేడర్స్ బ్రేక్ ఆవుట్ ఎటో ఒకవైపు జరిగేటంతవరకు మార్కెట్ కు దూరంగా ఉండటం మంచిది. రిస్క్ తీసుకొనే వారు మాత్రం 5635 స్టాప్ లాస్ తో బై చేయడం , 5725 స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది.కంపెనీల రిజల్ట్ సీజన్ దాదాపుగా ముగుస్తున్నందున మార్కెట్ ట్రెండ్ తీసుకొనే అవకాశం కలదు.సోమవారం BHEL రిజల్ట్ కలదు.అదే విధంగా మంగళవారం MARUTHI , RBI POLICY కలవు. నిఫ్టీ గత పదమూడు ట్రేడింగ్ సెషన్స్ నుండి 5635-5725 మధ్య కదలాడుతూ ట్రేడింగ్ కి ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు.ఈ రోజు కూడా నిఫ్టీ 5635 బ్రేక్ కాకపోతే 5690 వరకు దానిని అధిగమిస్తే మళ్ళీ అప్పర్ సైడ్ రేంజ్ వరకు కూడా వెళ్ళవచ్చు.ప్రస్తుతం పై లెవల్లో సెల్ చేయడం చాలా మంచిది.
పర్సనల్ లోన్స్ కి ఎందుకు దూరంగా ఉండాలి?
పర్సనల్ లోన్స్ కి ఎందుకు దూరంగా ఉండాలి?
ప్రస్తుత ప్రపంచంలో ఆదాయం పరిమితం కాని కోరికలు అనంతం . ఈ కోరికలను తీర్చుకోవడానికి మనకు ఉన్న దారులలో ముఖ్యమైనది పర్సనల్ లోన్స్ తీసుకోవడం లేదా క్రెడిట్ కార్డ్స్ వాడటం.ఒక్క విషయం మీరూ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి . మీరూ ఏవిధమైన అప్పు తీసుకున్న కూడా దానిని తీర్చవలసిన భాద్యత మీపై ఉంటుంది అంతేకాకుండా అది మిమ్ములను ఆర్ధికంగా ఇబ్బందులపాలు తప్పకుండా చేస్తుంది.అందువలన పర్సనల్ లోన్స్ తప్పని పరిస్థితి , అత్యవసరం ఐతే తప్ప వాటిని తీసుకోకూడదు. మీరు పర్సనల్ లోన్స్ తీసుకోవడం అనేది మీ చిట్టా చివరి అవకాశంగా ఉండాలి.
పర్సనల్ లోన్స్ సాదారణంగా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అంటే వైద్య ఖర్చులు, వివాహ ఖర్చులు, గృహోపకరణ వస్తువులు , క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చడం మొదలగు వాటిలో దేనికైనా వాడుకోవచ్చు.మీరూ పర్సనల్ లోన్స్ తీసుకొనేటప్పుడు దానిని ఎందుకు వినియోగిస్తున్నారో బ్యాంక్ వారికి తెలియచేయవలసిన అవసరం లేదు కాబట్టి పర్సనల్ లోన్స్ అంటే అన్ని రకాల అవసరాలకి ఉపయోగించే లోన్స్.సాదారణంగా హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్ , ఎడ్యుకేషనల్ లోన్స్ అంటే మీరూ వాటిని ప్రత్యేకంగా వాటి గురించి మాత్రమే ఉపయోగించాలి. మీరూ బ్యాంక్ నుండి పర్సనల్ లోన్స్ తీసుకోవడం కూడా చాలా సులభం . అంతేకాకుండా చాలా బ్యాంకులు పర్సనల్ లోన్స్ కోసం గ్యారంటర్ లేదా సెక్యూరిటీ కూడా అడగరు. అందువలన చాలా మంది పర్సనల్ లోన్స్ తీసుకోవడం చాలా మంచిది ఆనే ఉద్దేశంతో ఉంటారూ కాని పర్సనల్ లోన్స్ తీసుకోవడం అంత పెద్ద తప్పు ఇంకోటి లేదు. అని రకాల లోన్స్ లోకెల్లా అత్యంత వరస్ట్ లోన్స్ పర్సనల్ లోన్స్ .వీటిలో వసూలు చేసే వడ్డీ రేటు కూడా సాదారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది.సుమారు 14-18% వరకు వడ్డీ వసూలు చేస్తారు.
మనం ఒక ఉదాహరణ ద్వారా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.ఒక వ్యక్తీ అత్యవసర నిమిత్తమై రూ 5,00,000 బ్యాంక్ నుండి అప్పు తీసుకుంటే 17% వడ్డీ రేటుతో 5సంవత్సరాలలో తిరిగి చెల్లించటానికి ప్రతి నెల చెల్లించే emi రూ 12,426 తీసుకున్న లోన్ పై సుమారు రూ 2,45,560 వడ్డీ చెల్లించవలసి వస్తుంది. అంటే లోన్ పై 50% అధికంగా వడ్డీ రూపంలో చెల్లించవలసి వస్తుంది.
సాదారణంగా చాలా బ్యాంకులు ముందస్తూ చెల్లింపులకు ఒప్పుకోవు. దాని వలన మీ లోన్ కాలపరిమితి తీరేటంత వరకు వాయిదాలు చెల్లించవలసి ఉంటుంది. మీరు చెల్లించే వాయిదాలలో మొదటి రెండు సంవత్సరాలు ఎక్కువగా వడ్డీ చెల్లించడానికే వెళ్ళిపోతుంది.కొన్ని బ్యాంకులు ముందస్తూ చెల్లింపులకు అనుమతించిన ఎక్కువ పెనాల్టీ విదిస్తాయి.
ఇవి సాదారణంగా మీ ఆర్ధిక సానర్ద్యం బాగుండి తిరిగి చెల్లించే సామర్ధ్యం బాగుంటే మాత్రమే ఈ లోన్స్ మీకూ ఇస్తాయి.అదే విధంగా కొన్ని బ్యాంకులు హిడ్డేన్ చార్జీలు విధిస్తూ మీకూ ఇంకా భారాన్ని కలుగచేస్తాయి.చాలా మందికి లోన్ ఆఫర్ డాక్యుమెంట్స్ , అగ్రిమెంట్స్ కనీసం చదవకుండానే సంతకం పెడతారు. దానికి అధిక మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.మీ లోన్ వాయిదాలు నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే పెనాల్టీ చెల్లించ వలసి ఉంటుంది.ఒకవేళ మీరూ లోన్స్ చెల్లించడంలో విఫలమయి , డిఫాల్ట్ అయితే మీరూ భవిష్యత్తులో లోన్స్ పొందడం చాలా చాలా కష్టం అవుతుంది. అందువలన వీలు అయినంతవరకు పర్సనల్ లోన్స్ కి చాలా చాలా దూరంగా ఉండండి.ఒకవేళ అత్యవసర నిమిత్తమై డబ్బులు అవసరమైతే గోల్డ్ లోన్స్ ఏవైనా తీసుకోండి.తప్పని పరిస్థుతులలో వైద్యం కోసం ఐతే పర్సనల్ లోన్స్ తీసుకోవడంలో తప్పులేదు కాని విహర యాత్రలకి , వస్తువులకి మొదలగు వాటికి మాత్రం పర్సనల్ లోన్స్ ఎలాంటి పరిస్థుతులలో కూడా తీసుకోవద్దు.
మీరూ అందుకోనే సాలరీ ద్వారా ఏ విధంగా కోటీశ్వరుడు కావచ్చు.
మీరూ అందుకోనే సాలరీ ద్వారా ఏ విధంగా కోటీశ్వరుడు కావచ్చు.
సాదారణంగా అందరూ కేవలం మీరూ అందుకొనే సాలరీ ద్వారా జీవితంలో కోటీశ్వరుడు కావడం ఏ మాత్రం సాధ్యం కాదు అనే అపోహలో ఉంటారు.
కాని మీరూ సరియైన ఫైనాన్సియల్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకుంటే మాత్రం జీవితంలో కేవలం సాలరీ ద్వారా కూడా కోటీశ్వరుడు కావచ్చు. దానికోసం మీరూ మూడు విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.అవి
ఇన్వెస్ట్ చేసే మొత్తం,
రాబడి శాతం,
ఇన్వెస్ట్మెంట్ కొనసాగించే కాలం
మీరూ పై మూడు విషయాల పట్ల పూర్తీ అవగాహన కలిగి ఉండి క్రమశిక్షణ తో ప్రతి నెల కనుక ఇన్వెస్ట్ చేసే మీరూ భవిష్యత్తులో కోటీశ్వరుడు సులభంగా కావచ్చు. దీనికి మీరూ ప్రతినెల ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం ఎంతో తెలిస్తే మీరే అచ్చర్యపోతారు. ఐతే ఇది మీకూ వచ్చే రాబడి శాతం అదే విధంగా మీరూ ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నుకున్న అసెట్ క్లాస్ పై ఆధారపడి ఉంటుంది.
ఇన్వెస్ట్ చేసే మొత్తం,
క్రింద ఇచ్చిన టేబుల్ ను మీరూ మీ టార్గెట్ ఐనటువంటి కోటీశ్వరుడు కావడానికి ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలో సుమారుగా అంచనా వేసి ఇవ్వడం జరిగినది.మీరూ ఇన్వెస్ట్మెంట్ చేసే కాలం , వచ్చే రాబడి శాతంపై మీరూ ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారపడి ఉంది.ఈ టేబుల్ మీరూ కోటీశ్వరుడు ఎంత కాలంలో కావాలి అనుకుంటున్నారో దానికి అనుగుణంగా మీరూ ప్రతి నెల ఎంత ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవడానికి సహాయపడుతుంది.
కోటీశ్వరుడు కావడానికి ప్రతినెల ఇన్వెస్ట్ చేయవలసిన మొత్తం
| |||||
ఇన్వెస్ట్ చేసే కాలం సం లలో
|
ఇన్వెస్ట్ చేసే కాలం నెలలలో
|
6%
|
10%
|
15%
|
18%
|
25
|
300
|
14425
|
7600
|
3152
|
1808
|
24
|
288
|
15589
|
8450
|
3666
|
2161
|
23
|
276
|
16871
|
9426
|
4268
|
2585
|
22
|
264
|
18300
|
10531
|
4973
|
3092
|
21
|
252
|
19875
|
11781
|
5800
|
3710
|
20
|
240
|
21620
|
13201
|
6771
|
4436
|
19
|
228
|
23570
|
14819
|
7915
|
5322
|
18
|
216
|
25770
|
16670
|
9265
|
6391
|
17
|
204
|
28253
|
18797
|
10870
|
7866
|
16
|
192
|
31075
|
21255
|
12275
|
9260
|
15
|
180
|
34302
|
24110
|
15045
|
11179
|
14
|
168
|
38024
|
27451
|
17785
|
13531
|
13
|
156
|
42355
|
31392
|
21092
|
16430
|
12
|
144
|
47445
|
36086
|
25130
|
20028
|
11
|
132
|
53500
|
41739
|
30097
|
24553
|
10
|
120
|
60820
|
49640
|
36291
|
30238
|
9
|
108
|
69810
|
58258
|
44135
|
37560
|
8
|
96
|
81115
|
69180
|
54250
|
47131
|
7
|
84
|
95715
|
83387
|
67630
|
59940
|
రాబడి శాతం,
రాబడి శాతం నిర్ణీతకాలంలో మీరూ ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో పెరుగుదల ఏవిధంగా ఉంటుందో తెలియచేస్తుంది.అధికరాబడి ఉంటే మీరూ చాలా త్వరగా కోటీశ్వరుడు కావచ్చు.కాని ఒక్క విషయం అధిక రాబడి ఉంటే రిస్కు కూడా అధికంగానే ఉంటుంది.అందువలన మీరూ తీసుకొనే రిస్కు లేదా భరించగలిగే రిస్కు కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి.తక్కువ రిస్కు ఉన్న వాటిలో రాబడి కూడా తక్కువగానే ఉంటుంది. మీరూ ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రిస్కు లేకుండా రాబడి మాత్రం ఉండదు.మీరూ మంచి రాబడి అందుకోవాలి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ను అధిక రిస్కు ఉండే మ్యుచవల్ ఫండ్స్, షేర్ మార్కెట్ మరియు తక్కువ రిస్కు ఉండే బాండ్స్, గోల్డ్, పి పి ఫ్ మొదలగు వాటిలో ఇన్వెస్ట్ చేయడం వలన మంచి రాబడి అందుకోవచ్చు.ఒకవేళ మీరూ ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్ లో ఒక్కటి నష్టాన్ని కలిగించిన మరొక్కటి ఆ నష్టాన్ని భర్తీ చేయగలదు.
ఇన్వెస్ట్మెంట్ కొనసాగించే కాలం
మీరూ అధిక కాలం ఇన్వెస్ట్ చేయడం వలన మీరూ మొదట ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్నితిరిగి ఇన్వెస్ట్ చేయడం వలన అధిక రాబడి అందుకోవచ్చు.అందువలన మీరూ వీలయినంత త్వరగా ఇన్వెస్ట్ చేసి దానిని అధిక కాలం కొనసాగేలా చూసుకోవాలి.
No comments:
Post a Comment